ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ముంబైపై 3 వికెట్ల తేడాతో జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ (2/34), గెరాల్డ్ కొయెట్జ్ (1/10), అర్షద్ ఖాన్ (1/18), రషీద్ ఖాన్ (1/21), సిరాజ్ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(43), బట్లర్(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్(2/22) ఆకట్టుకున్నారు.గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా తెవాటియా(11 నాటౌట్), అర్షద్ఖాన్(1 నాటౌట్) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.
ప్రత్యేక
ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆర్సీబీ, సీఎస్కే, ముంబై ఇండియన్స్ జట్లు కూడా ఇప్పటివరకు చేయలేని ఘనతను సాధించింది.గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి దూకుడుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో గుజరాత్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గుజరాత్ జట్టులోని టాప్-3 బ్యాటర్లు కూడా ప్రతి మ్యాచ్లోనూ పరుగులు సాధిస్తున్నారు.గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక ఘనత సాధించింది. గుజరాత్కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఒకే ఐపీఎల్ సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ముగ్గురు ఆటగాళ్లు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎప్పుడూ చూడలేదు.

అత్యధిక
ఈ ముగ్గురు ఆటగాళ్లలో సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఉన్నారు. సాయి సుదర్శన్ ఇప్పటివరకు 509 పరుగులు, శుభ్మన్ గిల్ 508 పరుగులు, జోస్ బట్లర్ 500 పరుగులు సాధించారు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు గుజరాత్ టైటాన్స్కు చెందిన వారే కావడం గమనార్హం.శుభ్మన్ గిల్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దీని కారణంగా శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. గిల్ కాకుండా జోస్ బట్లర్ 30 పరుగులు చేశాడు.
Read Also :India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా?