రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఉదయం 11.52 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం లభించింది.
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ప్రముఖులు
తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య, జెసి శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సత్యవేడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, మురళీ మోహన్, కోనేటి ఆదిమూలం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, స్టేట్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం
అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్ నందు చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు చేరుకుని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ తదితర కార్యక్రమాలలో పాల్గొనుటకు 12.03 గంటలకు బయల్దేరి వెళ్లారు.