Godavari River: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు ఒక మృతదేహం లభ్యం

Read Time:  1 min
Godavari River: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు ఒక మృతదేహం లభ్యం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మడివరం మండలం, కమినిలంక సమీపంలోని గోదావరిలో నిన్న 8 మంది యువకులు గల్లంతైన విషయం విదితమే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు(NDRF Teams), పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు. కె. గంగవరం మండలం, శేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Godavari River: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు ఒక మృతదేహం లభ్యం
Godavari River: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు ఒక మృతదేహం లభ్యం

యువకులు

వీరిలో కొందరు మధ్యాహ్నం భోజనాల తర్వాత ఈత సరదా తీర్చుకునేందుకు గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా, 8 మంది గల్లంతయ్యారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. 

Read Also : Guntur: భార్యను అశ్లీల వీడియోలతో చిత్రహింసలకు గురి చేసిన కానిస్టేబుల్

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.