Gautam Rao is BJP MLC candidate for Hyderabad local bodies

BJP: హైదరాబాద్‌ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావు

BJP : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతం రావు పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది.

Advertisements
హైదరాబాద్‌ స్థానిక సంస్థల బీజేపీ

నేటితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ

హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నేటితో (శుక్రవారం) నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు పేరును ఖరారు చేసింది హైకమాండ్. మరికాసేపట్లో గౌతం రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు

ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగనుండగా.. ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న నిర్వహించి, ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.

Related Posts
సామ్‌సంగ్ షేర్లు 4 సంవత్సరాల కనిష్టానికి చేరాయి
samsung india gst investigation

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఈ సంవత్సరం 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ఈ సంవత్సరం టీఎస్‌ఎమ్‌సీ (TSMC) మరియు ఎన్విడియా Read more

ఏపీలో కరవు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన
Central team visit to droug

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరవు మండలాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం రేపటి నుంచి పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ Read more

బర్డ్ ఫ్లూ ప్రభావం.. మటన్, చేపల ధరలకు రెక్కలు
బర్డ్ ఫ్లూ ప్రభావం.. మటన్, చేపల ధరలు కొత్త రికార్డు

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాలు పెరిగిపోయాయి. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులు ఇప్పుడు తెలంగాణకూ విస్తరించాయి. కోళ్లు మృత్యువాత పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. Read more

మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి
మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×