దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం.. 24 మంది మృతి

South Korea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం.. 24 మంది మృతి

దక్షిణ కొరయాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, చెట్లను దహించివేస్తూ.. ఉవ్వెత్తున మంటలు ఎగిసిప డుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చు వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది మాత్రమే కాకుండా 1300 ఏళ్ల నాటి, యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ బౌద్ధ దేవాయలం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరోవైపు ఈ మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది విపరీతంగా కష్ట పడుతోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దావానలం అదుపులోకి రావడం లేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

Advertisements
దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం.. 24 మంది మృతి

భారీ నష్టాన్నే మిగిల్చిన కార్చిచ్చు
వారం రోజుల క్రితం దక్షిణ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ నష్టాన్నే మిగిల్చింది. బలమైన పొడి గాలు కారణంగానే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని.. ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ తెలిపింది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా వేలాది హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అలాగే ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

1300 ఏళ్ల నాటి పురాతన బౌద్ధ దేవాలయం ధ్వంసం
ఇది మాత్రమే కాకుండా కార్చిచ్చు కారణంగా 1300 ఏళ్ల నాటి పురాతన బౌద్ధ దేవాలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ గుడికి గతంలోనే యునెస్కో గుర్తింపు కూడా లభించగా.. కార్చిచ్చు వ్యాపించే అవకాశం ఉన్నందున ఆలయంలోని కళాఖండాలతో పాటు పలు విగ్రహాలను ముందుగానే ఇతర దేవాయలకు తరలించారు.

మంటలు వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు వేరే ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. అలాగే 68 శాతం మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని.. కానీ ఉత్తర, దక్షిణ జయోంగ్‌సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయని వివరించారు.

Related Posts
ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయి: అమెరికా సైన్యం ప్రకటన
f 15

ఈ మధ్యకాలంలో అమెరికా సైన్యం మధ్యప్రాచ్య ప్రాంతంలో శక్తిని పెంచేందుకు ఓ కీలకమైన చర్య చేపట్టింది. ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు మధ్యప్రాచ్య ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ జెట్‌లు Read more

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 56 సంవత్సరాల తరువాత గయానాను సందర్శించారు
modi guyana

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాను సందర్శించి, 56 సంవత్సరాల తరువాత గయానా వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. ఆయన గయానా రాజధాని Read more

కెనడాలో ఖలిస్థానీ గ్రూపులపై ట్రూడో ప్రకటన
trudo

కెనడా మరియు భారతదేశం మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు ప్రస్తుతం ఉద్రిక్తతలకు లోనయ్యాయి. ఈ పరిస్థితి మరింత ఘటించి, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల తొలిసారిగా కెనడాలో Read more

USA: భారత నిఘా సంస్థ ‘రా’ పై ఆంక్షలు విధించిన అమెరికా ?
Has the US imposed sanctions on Indian intelligence agency 'RAW'?

USA: భారత్‌ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల ది యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×