అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శత్రు, మిత్ర దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ అమెరికా కఠిన వైఖరి చూపిస్తోంది. టారిఫ్ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం ఖాయం కావడంతో, అమెరికాలో ప్రజలు షాపింగ్ మాల్స్ వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు,ఇంటికి సంబందించిన వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్లు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10 శాతం సుంకాలు విధించినప్పటికీ, మిగతా భాగాన్ని ఏప్రిల్ 10 నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది.అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. రెవెన్యూ సర్వీసుల నుంచి 20 వేల మంది తొలగించారు. ఖర్చులు తగ్గించుకునేందుకే ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ బాదుడు, ట్యాక్సులతో ట్రంప్ కంపెనీ నడుపుతున్నారా? కంట్రీని నడుపుతున్నారా అనే అనుమానం కలిగిస్తోంది. అటు ట్రంప్ కార్పోరేట్ కల్చర్తో అమెరికాలోను హాట్ టాఫిక్గా మారింది. ట్రంప్ టారిఫ్లతో ఆర్థికవేత్తలే కాదు యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కంబోడియా
అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్లు విధించిన అధ్యక్షుడు ట్రంప్ అత్యధికంగా కంబోడియాపై 49 శాతం వరకు పన్నులు విధించారు. భారత్పై 26 శాతం, చైనాపై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు. దీంలో అమెరికా విధించిన టారిఫ్లపై చైనా సీరియస్గా స్పందించి ప్రతీకార సుంకాలు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు మాత్రమే విధించే ఈ టారిఫ్లు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.చైనా ప్రతీకార సుంకాలపై ట్రంప్ స్పందించారు . చైనా భయపడింది తప్పు నిర్ణయం తీసుకుంది. మరో మార్గం లేకే ఈనిర్ణయం తీసుకుందని తప్పుబట్టారు ట్రంప్. ఇదిలా ఉంటే బ్రిటన్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎగుమతులకు బ్రేక్ పడింది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అమెరికాకు దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం ట్యాక్స్ విధించడంతో జేఎల్ఆర్ ఈనిర్ణయం తీసుకుంది.

ఆర్థికవేత్తలు ఆందోళన
పెట్టుబడుల కోసం అమెరికా పౌరసత్వానికి వీలు కల్పించే గోల్డ్ కార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. 35 ఏండ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. సుమారు రూ.43 కోట్లు చెల్లించి ఈ కార్డును పొందొచ్చని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ చర్యలతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు మాజీ అధ్యక్షుడు ఒబామా. ట్రంప్ టారిఫ్లతో అమెరికాకు ఒరిగేదేం లేదన్నారు. తాజా పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ఒబామా. మరోవైపు ట్రంప్ పరిపాలన చర్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో నిరసన కారులు ఆందోళనకు దిగారు.