భూమిపై జీవనం ఎప్పటివరకు కొనసాగుతుందో ఊహించుకోవడం కష్టమే. కానీ, తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఊహకంటే ముందే ఒక నిజాన్ని వెల్లడించారు. భూమిపై ఆక్సిజన్ ఇంకా వంద కోట్ల సంవత్సరాల వరకే మిగిలే అవకాశముందని టోక్యో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.టోహో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయనం ఫలితాలు ‘నేచర్ జియోసైన్స్’ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనానికి డాక్టర్ కజుమి ఒజాకి నాయకత్వం వహించారు.

భవిష్య భూమి ఎలా ఉంటుంది?
ఈ పరిశోధనలో భవిష్య వాతావరణ మార్పులపై 400,000 సిమ్యులేషన్లు చేశారు. ముఖ్యంగా సూర్యుడు వృద్ధిచెందే సమయంలో భూమిపై జరిగే మార్పులు అధ్యయనం చేశారు.సూర్యుడి వేడి పెరిగే కొద్దీ భూమిపై ప్రభావం తీవ్రమవుతుంది. ఇది నీటి ఆవిరీలో పెరుగుదల, ఉష్ణోగ్రతల పెంపు, కార్బన్ చక్రంలో అంతరాయం వంటి పరిణామాలకు దారితీస్తుంది.
ఆక్సిజన్ ఎలా తగ్గిపోతుంది?
సూర్యుడి వేడి పెరగడంతో నీరు వేగంగా ఆవిరైపోతుంది.
ఈ వేడితో భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి.
కార్బన్ చక్రం స్థిరంగా పని చేయలేదు.
మొక్కలు కిరణజన్య సంయోగక్రియ చేయలేకపోతాయి.
ఫలితంగా, ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోతుంది.
భవిష్య వాతావరణం ఎలా ఉంటుందంటే…
ఈ పరిస్థితుల వల్ల భూమి వాతావరణం మళ్లీ ఆదిమ దశకు చేరుతుంది. అక్కడ ఎక్కువ మీథేన్, తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఇవి జీవానికి అనుకూలమైన వాతావరణం కాదు.ఈ మార్పులు ఒక్కసారిగా రావు. కానీ, ఒక నిర్దిష్ట దశ తర్వాత వేగంగా జరుగుతాయని సిమ్యులేషన్లు చెబుతున్నాయి.ఆక్సిజన్ లేకుండా జీవం కొనసాగడం అసాధ్యం. ముఖ్యంగా మనుషులలాంటి ఎయిరోబిక్ జీవులకు ఇది పెద్ద సవాలు. తక్కువ ఆక్సిజన్, అధిక మీథేన్ వాతావరణంలో జీవించడం అసాధ్యమవుతుంది.గత పరిశోధనల ప్రకారం జీవరాశి ఇంకా రెండు బిలియన్ సంవత్సరాలు ఉంటుంది అనుకున్నారు. కానీ ఈ తాజా అధ్యయనం ఈ అంచనాను ముందుగానే తీసుకొస్తోంది.కజుమి ఒజాకి అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్య భూమిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక కీలక అడుగు. ఇప్పటివరకు ఎవరూ అంచనా వేయలేని సమయాన్ని, ఆధునిక సూపర్ కంప్యూటర్లు విశ్లేషించగలిగాయి.ఈ పరిశోధన మన భవిష్యపు పర్యావరణంపై స్పష్టతనిస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also : India : టీఆర్టీ వరల్డ్, గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాలకు చెక్