Earthquake in Myanmar.. Death toll rises to 2700

Earthquake : మయన్మార్‌లో భూకంపం..2700కు పెరిగిన మృతులు

Earthquake : మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో ఇటీవల 12 నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల ధాటికి అనేక భవంతులు ఊగిపోగా.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ భూవిలయం లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం వచ్చిన ఆ భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారని తాజాగా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా.. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.

Advertisements
image

వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం

ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రీస్కూల్ కూలిపోవడంతో 50 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు చనిపోయారని ఐరాస సిబ్బంది వెల్లడించారు.

వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు

వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు అవరోధంగా మారాయి. ఈ పరిణామాల మధ్య మృతుల సంఖ్య ఎంతకు చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ తక్షణమే అందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు పిలుపునిస్తున్నాయి.

Related Posts
రాజారెడ్డి ఐ సెంటర్ న్ను ప్రారంభించిన జగన్
Raja Reddy Eye Center

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. Read more

sudiksha konanki: సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?
సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?

డొమినికన్ రిపబ్లిక్‌లో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన భారతీయ సంతతికి చెందిన సుదీక్ష కోణంకి చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం అక్కడి పోలీసులను కోరింది. అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ Read more

18 ఏళ్ల బాలికకు ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమా చికిత్స
Treatment of extraosseous osteosarcoma in an 18 year old girl

విజయవాడ : అసాధారణమైన వైద్య విజయంను ప్రతిబింబిస్తూ, మంగళగిరికి చెందిన 18 ఏళ్ల బాలిక అరుదైన ఎముక క్యాన్సర్‌కు సంబంధించిన ఆస్టియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స పొందింది. ఈ Read more

అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత..కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్..!
Bandi sanjay protest at ashok nagar after meet group 1 aspirants 1

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×