శ్రీకాళహస్తి(Srikalahasti) శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి వచ్చేనెల ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) పరిశీలించారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి ఆల ఈవో బాపిరెడ్డిని ఆదేశించారు. అంతేకాకతో ఇంజనీరింగ్ శాఖతో ఏర్పాట్లపై సమీక్షించారు.
Read also: Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి శివరాత్రి పర్వదినాన వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని అందుకు తగ్గట్టు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు అంతేకాక వచ్చిన భక్తులకు సుదర్శనం సత్వర దర్శనం పై పలు సూచనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన లక్షకుపైగా భక్తులు వస్తారు కాబట్టి దానికి తగ్గట్లు ఏర్పాటు ఉండాలని ఆదేశించారు. కొత్తగా కొత్త ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను మంత్రి పరిశీలించారు. తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనానంతరం వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలను అందించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: