📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల వివాదం – బీజేపీ ఎంపీ అల్టిమేటం!

Author Icon By Vanipushpa
Updated: April 7, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం లేఖలను అమలు చేయాలని సూచించినా, టీటీడీ బోర్డు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శించారు. తెలంగాణ భక్తులకు కూడా సమాన హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన వినతి మేరకు, ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని నిర్ణయించినా, ఇంకా కార్యరూపం దాల్చలేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.


టీటీడీ లెక్కలు – ఒత్తిడిపై వాదనలు
ప్రస్తుతం 75 వేల మంది భక్తులు రోజూ శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. వీటిలో 7500 టికెట్లు వీఐపీలకు కేటాయిస్తుండగా, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు 2000 టికెట్లు కేటాయిస్తున్నారు. తెలంగాణ నేతల లేఖలను పరిగణలోకి తీసుకుంటే రోజుకు అదనంగా 1100 టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అల్టిమేటం
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తప్పుదోవ పట్టించేలా టీటీడీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వకపోతే, స్వయంగా తిరుమల వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు.

#telugu News Ap News in Telugu BJP MP's ultimatum! Breaking News in Telugu Controversy over letters Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telangana representatives in Tirumala Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.