CJI SuryaKant: తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ గారికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఆలయ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

Read Also:BR Naidu: డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అటు తరువాత టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరహస్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: