Development : ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు

Read Time:  1 min
Welfare schemes continue despite financial deficit
Welfare schemes continue despite financial deficit
FONT SIZE
GET APP

కావలి (నెల్లూరు) : రాష్ట్రంలో రూ. 16 వేల కోట్లు ఆర్ధిక లోపు వున్న ప్పటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెల్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం ఆయన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి. ఎమ్మెల్సీ బీదా రవిచంద్రాతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. తుమ్మలపెంట పంచాయితీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనం తరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రా లను పంచి ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. తుమ్మలపెంట లోని పట్టపుపాళెం వద్ద రూ.42.6 లక్షల వ్యయంతో అంతర్గత సిసి రోడ్లకు, తుమ్మలపెంట పల్లిపాళెం వద్ద రూ.44 లక్షల వ్యయంతో జల జీవన్ మిషన్ కింద త్రాగునీటి వసతికి, రూ. 27.4 లక్షల వ్యయంతో సీసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఓట్లూరు వద్ద రూ.25 లక్షల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం, రూ. 55 లక్షలతో వ్యయంతో రక్షిత మంచినీటి పథకం శంకుస్థాపనలు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవింద్ర మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలలో పలు హామీలలో 95 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ఫించన్లను పెంచి అరియర్స్ పాటు ఒకే సారి ఫించన్దారులకు చెల్లించడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో 64 లక్షల మంది ఫించన్ దారులు వున్నారని, నెలకు రూ. 4వేలు ఫించన్ ఇచ్చే ఎకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వుందన్నారు.

తల్లికి వందనం కింద కుటుంబంలో చదువు కుంటున్న పిల్లలందరికి ఇంటర్మీడియట్ వరకు రూ.13 వేలు వంతున చెల్లించడం జరుగు తుందన్నారు. శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ మత్సకారుల సమస్యలు తెలిసిన వ్యక్తి మంత్రి కొల్లు రవింద్రా అని కోనియాడారు. తమ ప్రభుత్వ హయంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యదిక నిధులతో సిసి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అవసరం మేరకు అంగన్వాడీ కేంద్రాలు తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామీణ సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి తుమ్మలపెంటకు వచ్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి, మత్సకారుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోని పధకాలు అందని వారికి అవి అందే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం చెప్పట్టినట్లు తెలిపారు.

Welfare schemes continue despite financial deficit

ఓట్టూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ఆయన అన్నారు. ఈ రోజు సీసీ రోడ్డుతో పాటు, మంచి నీటిని అందించే విదంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజులలో డ్రైనేజిలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్మశాన వాటికకు వెల్లే రోడ్లను పూర్తిగా వేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి కావలి రూరల్ మండల అధ్యక్షులు అవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ అలేఖ్య. బీదా గిరిధర్, వలగాటి శ్రీనివాసుల రెడ్డి, అప్కాబ్ మాజీ చైర్మన్ పాల్ శెట్టి, నూడా మాజీ డైరెక్టర్ పాలడగు రంగారావు, మాజీ జడ్పిటీసి సభ్యులు నాయుడు రాంప్రసాద్, టిడిపి నాయకులు, కార్యకర్తలు వున్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Tirumala : తక్కువ ధరలో తిరుపతిలో బ్రాండెడ్  హోటళ్లు

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.