हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Delimitation: డెలిమిటేషన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు

Sharanya
Delimitation: డెలిమిటేషన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు

ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన అంశాల్లో డీలిమిటేషన్ ఒకటి. ఇది దక్షిణాది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ మధ్య ప్రచ్చన్న యుద్ధాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధానంగా జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయం బీజేపీయేతర ప్రభుత్వాల నుంచి వ్యక్తమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే జేఏసీ సమావేశాన్ని నిర్వహించి, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని రాష్ట్రాలు కూడా ఇదే దిశగా స్పందించనున్న సూచనలు కనిపిస్తున్నాయి.

gorantla 8ade5da07d

డీలిమిటేషన్ అంటే ఏమిటి?

డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. దీని ద్వారా జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్నిర్వచిస్తారు. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా చేపడతారు. అయితే 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు డీలిమిటేషన్‌ను నిలిపివేసింది. 2002లో మరోసారి ఈ నిషేధాన్ని 2026 వరకు పొడిగించారు. ఇప్పుడు 2026 తర్వాత కొత్త డీలిమిటేషన్ జరగనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ) గత కొన్నేళ్లుగా జనాభా నియంత్రణలో ముందున్నాయి. వీటి జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్) జనాభా పెరుగుతోంది. 2026 డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే, ఉత్తరాది రాష్ట్రాలకు అధిక పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని భయపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కేంద్రం డీలిమిటేషన్ విషయంలో వెనకడుగు వేయాలని, లేకపోతే తమ నిరసనలు ఉధృతం అవుతాయని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ మరియు టీడీపీ వైఖరి:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ అంశంపై ఇప్పటివరకు ఓపెన్‌గా స్పందించలేదు. బీజేపీతో పొత్తులో ఉన్నందున ఈ అంశంపై అధికారికంగా మాట్లాడటానికి టీడీపీ జంకుతోంది. అయితే, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేది. జనాభా ఆధారంగా పార్లమెంటరీ సీట్ల సంఖ్యను నిర్ణయించడం సరికాదు, అని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా డీలిమిటేషన్‌పై తన అభిప్రాయాన్ని ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశంలో వెల్లడించారు. “డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు” అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా, ఎంపీలు పార్లమెంట్లో గళం విప్పాలని, అనంతరం ప్రజా పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు.

బుచ్చయ్య చౌదరి షాకింగ్ కామెంట్స్:

టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, డీలిమిటేషన్‌పై చంద్రబాబు, పవన్ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. కానీ బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు, అని వెల్లడించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ, జగన్ మళ్లీ ఊచలు లెక్కబెట్టాల్సిందే! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం కాదు, జైలుకు వెళ్ళడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ డీలిమిటేషన్ అంశం దక్షిణాదిలో బీజేపీకి వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ, జనసేన ఎటువైపు ఉంటాయనే అంశం ఆసక్తిగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870