బీజేపీ సర్కారు (BJP govt) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఢిల్లీని నాశనం చేసిందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు.

కేజ్రీవాల్ ప్రకారం, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో పర్యావరణ, విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా వంటి కీలక రంగాల్లో విఫలమై, ప్రజలకు నష్టాన్ని కలిగించిందని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఢిల్లీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు అతిషిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ పోస్టు పెట్టారు.
కూల్చివేతలకు వ్యతిరేకంగా కల్కాజీలోని భూమిహిన్ క్యాంపులో జరుగుతున్న ఆందోళనల్లో ఇవాళ అతిషి పాల్గొన్నారు. దాంతో ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో బీజేపీ ఢిల్లీని సర్వనాశనం చేసిందని విమర్శించారు.
Read Also:Fire Accident: ఢిల్లీలో అపార్టుమెంటులో అగ్నిప్రమాదం ఒక్కటే ఇంట్లో 3 మృతి