📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Secunderabad : సికింద్రాబాద్ లో యువ వైద్యుడి ఆత్మహత్య.. ఎందుకంటే!

Author Icon By Anusha
Updated: March 27, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సికింద్రాబాద్‌లో ఓ యువ వైద్యుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వయస్సు పెరుగుతున్నా వివాహం కాకపోవడం, నిశ్చితార్థం అయ్యాక సంబంధం రద్దవడం వల్ల కలిగిన మనోవేదన అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.బుధవారం ఉదయం సికింద్రాబాద్‌లోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యావలరీ బ్యారక్‌ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలపై యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన లోకో పైలెట్ వెంటనే జీఆర్పీ (రైల్వే) పోలీసులకు సమాచారం అందించారు.

పెళ్లి సంబంధం

తర్వాత కిషోర్ కు వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలను చూస్తున్నా కుదరడం లేదు దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కిషోర్‌ తన ద్విచక్రవాహనంపై ఇంట్లో నుంచి బటయకు వెళ్లాడు ఆ తర్వాత బొల్లారం వెళ్లి అక్కడ రైల్వేస్టేషన్‌ వద్ద వాహనాన్ని ఉంచాడు.అనంతరం సమీపంలోని క్యావలరీ బ్యారక్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చేరుకున్న కిషోర్ని జామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌సాహిబ్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురోహిత్ కిషోర్

గుజరాత్‌కు చెందిన ప్రకాష్ మాల్ కుటుంబం కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ప్రకాష్ మాల్ చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ (34) ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.34 ఏళ్లు ఉన్నతంగా చదువుకున్నాడు వైద్య వృత్తి సమాజంలో మంచి పేరు కూడా ఉంది, కానీ పెళ్లి కావడంలేదు బట్ట తల ఉందని అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు,ఈ క్రమంలోనే ఓ సంబంధం కుదిరింది,ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది,కానీ బట్టతల ఉందని,అమ్మాయి పెళ్లిని ఆపింది.దీంతో కుదిరిన సంబంధం కూడా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పురోహిత్ కిషోర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ,చివరకు ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అవగాహన

వయస్సు పెరుగుతున్నా వివాహం కాని వారిపై కుటుంబాలు, సమాజం ఒత్తిడి పెంచడం,బట్టతల, శరీర ఆకృతి వంటి కారణాలతో పెళ్లి సంబంధాలు రద్దు కావడం,తన కుంటుంబానికి అపఖ్యాతి వస్తుందనే భయం వ్యక్తులను తీవ్ర నిర్ణయాలకు దారితీస్తోంది.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం విషయంలో అవగాహన పెంచుకోవడం, అవసరమైన సందర్భాల్లో మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఎంతో అవసరం.అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డు చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 

#DoctorSuicide #MarriagePressure #Secunderabad #TragicIncident Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.