తనకు వరసకు మామ అయ్యే వ్యక్తి నచ్చాడనే కారణంతో పెళ్లైన 45 రోజులకి భర్తను సుపారీ ఇచ్చి (Crime news) చంపేయించింది భార్య. ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది ఈఘటన. 20 ఏళ్ల గుంజాదేవికి, పాతికేళ్ల ప్రియాంశుతో ఈ మధ్యే పెళ్లయ్యింది. ఐతే పెళ్లికి ముందే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్(Jeevan Singh)తో ప్రేమలో ఉంది. అతని వయసు 55 ఏళ్లు. ఈ వయసు తేడా కారణంగా పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి జీవన్ను చేసుకుంది.
సుపారీ గ్యాంగ్తో చీకటి డీల్ – భర్త హత్య
కానీ భర్తతో సంసారం ఇష్టం లేక, అటు మామను మర్చిపోలేక సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుని భర్తను (Crime news) చంపించేసింది. గతనెల 25న ప్రియాంశు (Priyanshu)ఓ పనిమీద ఊరెళ్లాడు. నవీనగర్ రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. స్పాట్లోనే జీవన్ చనిపోయాడు.

విచారణ మలుపు – కాల్ రికార్డ్స్తో బహిరంగం
విచారణలో ముందుగా ఎవరిపైనా అనుమానం లేదు. దోపిడీ దొంగల పనా అనే కోణంలోనే విచారణ మొదలుపెట్టారు. మధ్యలో ఎందుకో పోలీసులకు దేవిపై అనుమానం వచ్చింది. ఆ యాంగిల్లో దర్యాప్తు చేస్తే.. మామ జీవన్తో గుంజాదేవి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్టు కాల్రికార్డ్స్ ఆధారంగా తెలిసింది. ఇంతలో పోలీసులకు తనపై అనుమానం వచ్చిందని భావించిన దేవీ.. ఊళ్లోంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ టైమ్లో పోలీసులు ఎంటరై అరెస్టు చేశారు. ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులనూ జైలుకు పంపారు. మామ జీవన్ పరారీలో ఉన్నాడు.
అరెస్ట్, పరార్, జైలు – నిందితుల పరిస్థితి
గుంజాదేవి ఊరు వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు సుపారీ గ్యాంగ్ సభ్యులు జైలుకు పంపబడ్డారు. అయితే ప్రధాన నిందితుడు జీవన్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది.
కుటుంబ వ్యాపారం – న్యాయ వ్యూహాలు
ఈ కేసు అనంతరం పిల్లల పెళ్లిలో తల్లిదండ్రుల జోక్యం, సంబంధాలపై అవగాహన అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ వ్యవస్థపై తీవ్రమైన దెబ్బ అని పలువురు వృద్ధులు పేర్కొన్నారు.
read hindi news: hindi.vaartha.com
Read Also: Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో విషాదం..వేధింపులు