Vikarabad Crime: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ గ్రామంలో సోమవారం ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు (45) అనే వ్యక్తిపై రుద్రారం బాలు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నిందితుడు సాయిలు మెడపై బలంగా నరకడంతో, అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలే జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
Read also: Rajahmundry Milk Adulteration: కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
హత్య జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కరన్ కోట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుడు బాలు కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: