విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో (GGH) విధుల్లో ఉన్న ఓ యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడం వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపికా అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఆ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి.
Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

వెలుగులో కీలక విషయాలు
దీపికా ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం విజయవాడ GGHలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ చదువుతోంది. బుధవారం రాత్రి నుంచి ఆమె ఆసుపత్రిలో విధుల్లో ఉన్నారు. అయితే, తెల్లవారుజామున ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన తోటి వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్లో బల్లపై దీపిక అచేతనంగా బడి ఉండటాన్ని తోటి విద్యార్థిని గుర్తించారు. తోటి విద్యార్థిని దీపికకు ఇంజెక్షన్ చేయడానికి కాన్యులా పెట్టే క్రమంలో రెండు సూది ఆనవాళ్లు పడ్డాయి. మిగితా రెండు సూది గుర్తులు ఎందుకున్నాయనే విషయం దర్యాప్తు జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: