ఉత్తరాఖండ్(Uttarakhand)లోని డెహ్రాడూన్(Dehradun)లో ఘోర ప్రమాదం జరిగింది. చక్రతాలోని ‘టైగర్ వాటర్ ఫాల్స్ ‘(Tiger Waterfall)ను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై భారీ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఢిల్లీ(Delhi)కి చెందిన ఒక పర్యాటకుడు సహా ఇద్దరు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కొండపై నుండి అకస్మాత్తుగా ఒక భారీ చెట్టు పడి జలపాతం కింద స్నానం చేస్తున్న వారిపై కూలింది. పడిపోయిన చెట్టు కింద ఇద్దరూ చిక్కుకోగా, కొమ్మలు పడిపోవడంతో మరో ముగ్గురు పర్యాటకులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
ఒక్కసారిగా కుప్పకూలిన భారీ చెట్టు
మృతులు చక్రతాలోని సుజౌ గ్రామానికి చెందిన స్థానికుడు గీతారామ్ జోషి (48), ఢిల్లీలోని షాహ్దారాకు చెందిన అల్కా ఆనంద్ (55)గా గుర్తించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారిగా భారీ చెట్టు కుప్పకూలటం చూసిన స్థానికులు, సందర్శకులు వెంటనే సహాయం కోసం పరుగెత్తారు. చెట్టు కింద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసి అంబులెన్స్ ద్వారా చక్రతా సిహెచ్సికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఇద్దరూ అక్కడికి చేరుకునేలోపే మరణించారని వైద్యులు ప్రకటించారు.
Read Also: Viral Video: చెంపదెబ్బ కొట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడికి భార్య