📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Meerut Murder Case: డబ్బు భర్తది..షికార్లు ఏమో ప్రియుడితో..

Author Icon By Vanipushpa
Updated: March 24, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో వెలుగుచూసిన మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్‌, తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడికి ఇచ్చి బెట్టింగ్ ఆడించినట్లు తెలుస్తోంది. వచ్చిన డబ్బుతోనే వీరిద్దరూ విహారయాత్రను వెళ్లినట్లు సమాచారం.

అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష
విదేశాల్లో ఉంటున్న సౌరభ్‌- తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్‌లో పడగానే ముస్కాన్‌, తమ ప్రియుడికి చెప్పేదని, వాటితోనే సాహిల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ పెట్టేవాడని పోలీసువర్గాలు తెలిపాయి. బెట్టింగ్​లో వచ్చిన డబ్బుతో వీరిద్దరూ రిషికేశ్‌, దెహ్రాదూన్‌ వంటి ప్రాంతాలకు ట్రిప్‌లకు వెళ్లినట్లు తెలిసింది. సాహిల్‌కు ఎలాంటి ఉద్యోగం లేదని, గ్యాంబ్లింగ్, బెట్టింగ్​లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.
మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు
అంతేకాకుండా సౌరభ్​ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘ఫిబ్రవరి 22న ముస్కాన్‌ స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్దకు వెళ్లి, ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుంది. ఆ తర్వాత ఓ ఖాళీ ప్రిస్క్రిప్షన్‌ పేపర్‌ను కూడా సంపాదించింది. అందులోనే ముస్కాన్ ఇచ్చిన మందులు రాసింది. వాటితో పాటు ఆన్​లైన్​లో నిద్ర మాత్రల గురించి వెతికి ఆ పేర్లను కూడా రాసింది. ప్లాన్​ ప్రకారం ఫిబ్రవరి 25నే అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత మార్చి 4న అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
విడాకుల వరకు వెళ్లిన సౌరభ్‌
సౌరభ్‌ రాజ్‌పుత్‌, ముస్కాన్‌ 2016లో ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సౌరభ్‌ విడాకుల వరకు వెళ్లారు. కానీ కుమార్తె భవిష్యత్తు కోసం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన సౌరభ్‌ గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం మేరఠ్‌కు తిరిగొచ్చాడు. అడ్డు తొలగించుకోవాలని భావించిన ముస్కాన్‌ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది. శవాన్ని 15 ముక్కలుగా చేసి ప్లాస్టిక్‌ డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో కప్పిపెట్టింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The money belongs to the husband what about the hunting with the boyfriend..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.