Pune-మహారాష్ట్రలోని పూణేలో ప్రేమ వ్యవహారం విషాదకరంగా మారింది. స్థానిక యువతి ప్రేమలో ఉన్న రమేశ్ ఘెంగాత్ను(Ramesh Ghengat) ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రమేశ్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ప్రేమకు అడ్డువేసిన కుటుంబం
పోలీసుల సమాచారం ప్రకారం, పింప్రి చించ్వాడ్లోని సాంఘ్వి ప్రాంతానికి చెందిన యువతి రమేశ్తో ప్రేమలో ఉంది. ఈ సంబంధాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. రమేశ్పై గతంలో రేప్ కేసు(Rape Case), పోస్కో కేసులోనూ నిందితుడని ఆరోపిస్తూ తమ కూతురికి హెచ్చరికలు ఇచ్చారు. అయినా యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో, కుటుంబం చివరికి పెళ్లికి అంగీకరించింది.
పెళ్లి పేరుతో పన్నిన కుట్ర
పెళ్లి కుదిర్చుకునేందుకు రమేశ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించిన యువతి కుటుంబ సభ్యులు, ఆ సమయంలో అతనిని నిలదీశారు. తమ కూతురిని ప్రేమ పేరుతో మోసగించాడని ఆరోపించారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తులైన వారు రమేశ్ను గదిలోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల కారణంగా రమేశ్ స్పృహ తప్పగా, వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై రమేశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, మరో ఇద్దరిని వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
మహారాష్ట్రలోని పూణే, పింప్రి చించ్వాడ్ సాంఘ్వి ప్రాంతంలో జరిగింది.
బాధితుడి పేరు ఏమిటి?
రమేశ్ ఘెంగాత్ అనే యువకుడు దాడికి గురయ్యాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: