📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

సూసైడ్ లెటర్ చెల్లుబాటు కాదు, ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు

Author Icon By Vanipushpa
Updated: March 7, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా బలవంతం చేశాడని ఆరోపించారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసును నిరూపించడానికి సూసైడ్ నోట్ మాత్రమే సరిపోదని, దానితో పాటు బలమైన ఆధారాలు అవసరమని కోర్టు పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరం అని నిరూపించాలంటే ఆత్మహత్యకు ప్రేరేపించాలనే స్పష్టమైన ఉద్దేశం ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కేసును నిరూపించాలంటే స్పష్టమైన ఆధారం ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడికి ఆత్మహత్యను ప్రేరేపించాలని స్పష్టమైన మానసిక ఉద్దేశం ఉండాలని.. ఆత్మహత్యకు పాల్పడేలా బలవంతం చేసే ప్రత్యక్ష చర్య లేకపోతే కేవలం వేధింపులు లేదా విభేదాలు సరపోవని న్యాయస్థానం స్పష్టం చేసింది.


సూసైడ్ నోట్ ప్రామాణికత కాదు
స్పష్టమైన ఆధారాలు ఉంటేనే సూసైడ్ లెటర్ చెల్లుబాటు.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సూసైడ్ నోట్ వదిలివేస్తే.. దానికి ఇతర స్పష్టమైన ఆధారాలు మద్దతు ఇవ్వకపోతే అది శిక్ష విధించడానికి సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. సూసైడ్ నోట్ ప్రామాణికతను నిరూపించాలని కోర్టు వెల్లడించింది. దీని కోసం చేతిరాత నిపుణుడి సాక్ష్యం కూడా అవసరమని తెలిపింది. ఓ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ప్రత్యక్ష ఆధారాలు లేవని.. ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ప్రాసిక్యూషన్ వద్ద కచ్చితమైన ఆధారాలు లేవని నిందితులు పేర్కొన్నారు.
నిర్దోషులు విడుదల
నిర్ధోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఓ కేసులో గుజరాత్ హైకోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. తాజాగా సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు తీవ్రంగా రెచ్చగొట్టినప్పుడు, ప్రేరేపించినప్పుడు లేదా బలవంతం చేసినప్పుడు మాత్రమే సూసైడ్ కు ప్రేరేపించినట్లుగా నిరూపించబడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పటేల్ బాబూభాయ్ మనోహర్ దాస్, ఇతరులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

కింది కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారణ

ఈ కేసు గుజరాత్ కు చెందినది. మే 14, 2009న గుజరాత్ లోని మెహ్సానాలో ఓ వ్యక్తి విషం తాగాడు. అనంతరం అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఒక మహిళతో ఉన్న అభ్యంతరకరమైన ఫొటోలు తీశారని.. దీని ఆధారంగా కొంతమంది అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మృతుడి కుటుంబం ఆరోపించింది. మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆ సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు మొత్తం నలుగురిని నిందితులుగా నిర్ధారించారు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Suicide Supreme Court Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.