క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు నేటి యువత, చిన్న చిన్న సమస్యలకు, క్షణికావేశానికిలోనై ఎంతో విలువైన ప్రాణాలను తీసుకుంటూ తమ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. భవిష్యత్తును ఊహించలేని తొందరపాటు నిర్ణయాలతో తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నారు. తాజాగా తెలంగాణ, జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరిగడికి గ్రామానికి చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి కారు కొనివ్వలేదని మనస్తాపంతో గ్రామానికి చెందిన కూరాకుల సాయిరాజ్(Sai RAj) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సాయిరాజ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే తనకు కారు కొనిస్తే డ్రైవింగ్ వృత్తిలో స్థిరపడతానని గత కొన్ని రోజులుగా తండ్రిని అడుతున్నాడు. తండ్రి కనకయ్య మాత్రం తన వద్ద అన్ని డబ్బులు లేవని కారు కొనివ్వలేనని చెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన సాయిరాజ్ బుధవారం (మే 7) వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కారు కొనివ్వకపోతే మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా,అని స్థానికులు చర్చించుకుంటున్నారు. తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భావోద్వేగాలను
ఈ సంఘటన సమాజానికి, యువతకు పెద్ద హెచ్చరికగా నిలవాలి. తల్లిదండ్రులపై అలజడి ప్రదర్శించి, వారి సామర్థ్యాలకు మించి అడగడంఎంత తప్పో, అలాంటి నిరాకరణను తట్టుకోలేకపోయి ప్రాణాలు తీసుకోవడం మరింత బాధాకరం.తల్లిదండ్రులు కూడా పిల్లల మనస్తత్వాన్ని, వారి భావోద్వేగాలను గుర్తించి, వారితో తరచూ మాట్లాడుతూ, సహనంతో మార్గనిర్దేశనం చేయడం అత్యంత అవసరం. ఈ సంఘటనకు సంబంధించి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులు సాయిరాజ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
Read Also: PSR Anjaneyulu: ఏపీపీఎస్సీ కేసులో… మాజీ చీఫ్ పీఎస్ఆర్ కు రిమాండ్ పొడిగింపు