Sanathnagar Murder Case: హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఒక దారుణ హత్య వెలుగుచూసింది. భరత్ నగర్ వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: HPV Vaccine: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

ఘటన వివరాలు
మృతుడిని కర్ణాటకకు చెందిన శంకర్ (48)గా పోలీసులు గుర్తించారు. ఆయన గత రెండేళ్లుగా మూసాపేటలోని ఒక హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున వంతెన పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, నిందితులు ఆయనపై దాడి చేసి కత్తులతో(Crime) పొడిచి చంపినట్లు తెలుస్తోంది.
వివాహేతర సంబంధమే కారణమా?
ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. శంకర్ వ్యక్తిగత జీవితంలోని వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు సమాచారం అందుకున్న సనత్నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: