Police Alert:గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Read Time:  1 min
Police Alert
Police Alert
FONT SIZE
GET APP

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా(Police Alert) భద్రత కట్టుదిట్టం చేసిన వేళ, నోయిడా మరియు అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. నోయిడాలోని శివనాడర్ స్కూల్‌తో పాటు అహ్మదాబాద్‌లోని కొన్ని స్కూళ్లకు ఈ బెదిరింపులు అందినట్లు అధికారులు తెలిపారు.

Read Also:Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

Police Alert
Police Alert: Bomb threats issued to schools ahead of Republic Day.

నోయిడా, అహ్మదాబాద్ స్కూళ్లలో భద్రతా తనిఖీలు

సమాచారం అందగానే పోలీసులు అప్రమత్తమై వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. అహ్మదాబాద్‌లో బాంబు స్క్వాడ్ సహకారంతో పాఠశాల ప్రాంగణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా నోయిడాలోని శివనాడర్ స్కూల్‌లో విద్యార్థులను తక్షణమే బయటకు తరలించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో సమగ్రంగా పరిశీలించారు.

ఇప్పటివరకు అనుమానాస్పద వస్తువులు లేవు

తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద(Police Alert) వస్తువులు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.