మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. హనీమూన్ కోసం భార్య సోనమ్తో కలిసి మేఘాలయ వెళ్లిన రాజా అక్కడే హత్యకు గురవడమే కాక, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.భర్త రాజా రఘువంశీ(Raja Raghuvanshi)ని కిరాయి హంతకులు చంపడంలో విఫలమైతే, తానే స్వయంగా ఆయనను కొండపై నుంచి లోయలోకి తోసివేయాలని ఆయన భార్య సోనమ్ రఘువంశీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం,సోనమ్ ప్రియుడిగా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాతో “ఒకవేళ విశాల్, ఆనంద్, ఆకాశ్ కలిసి రాజాను చంపలేకపోతే ఫోటో తీస్తున్నట్టు నటిస్తూ నేనే అతడిని కొండపై నుంచి తోసేస్తాను” అని చెప్పినట్టు తెలిసింది.
అమలుపరిచేందుకు
వివాహం జరిగిన నాలుగు రోజులకే మే 15న ఇండోర్లోని పుట్టింటికి తిరిగి వచ్చిన సోనమ్, అక్కడి నుంచే ఈ హత్యకు పథకం రచించినట్టు సమాచారం. గువాహటి(Guwahati)కి టికెట్లు బుక్ చేసుకోవడమే కాకుండా, రాజ్ కుష్వాహాతో ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కుట్రను అమలుపరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంది. భర్త రాజా రఘువంశీతో శారీరక సంబంధాన్ని వాయిదా వేసేందుకు, మేఘాలయ(Meghalaya) వెళ్లే ముందు కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని, అది ఒక మంచి శకునమని నమ్మించి, సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది.రాజా రఘువంశీ పోస్టుమార్టం నివేదికలో,ఆయన తలపై పదునైన ఆయుధంతో రెండుసార్లు దాడి చేశారు. “మృతుడి తలపై రెండు చోట్ల పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలున్నాయి. ఒకటి తల వెనుక భాగంలో, మరొకటి ముందు భాగంలో ఉంది” అని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియెమ్ వెల్లడించారు.
Read Also: Meghalaya Murder: రఘువంశీ హంతకుడిని చెంప మీద కొట్టిన ప్రయాణికుడు