📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Meghalaya Murder: కిరాయి హంతకుల ప్రయత్నం.. తానె హతమారుస్తానన్న సోనమ్

Author Icon By Anusha
Updated: June 11, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. హనీమూన్ కోసం భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయ వెళ్లిన రాజా అక్కడే హత్యకు గురవడమే కాక, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.భర్త రాజా రఘువంశీ(Raja Raghuvanshi)ని కిరాయి హంతకులు చంపడంలో విఫలమైతే, తానే స్వయంగా ఆయనను కొండపై నుంచి లోయలోకి తోసివేయాలని ఆయన భార్య సోనమ్ రఘువంశీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం,సోనమ్ ప్రియుడిగా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాతో “ఒకవేళ విశాల్, ఆనంద్, ఆకాశ్ కలిసి రాజాను చంపలేకపోతే ఫోటో తీస్తున్నట్టు నటిస్తూ నేనే అతడిని కొండపై నుంచి తోసేస్తాను” అని చెప్పినట్టు తెలిసింది.  

Meghalaya Murder

అమలుపరిచేందుకు

వివాహం జరిగిన నాలుగు రోజులకే మే 15న ఇండోర్‌లోని పుట్టింటికి తిరిగి వచ్చిన సోనమ్, అక్కడి నుంచే ఈ హత్యకు పథకం రచించినట్టు సమాచారం. గువాహటి(Guwahati)కి టికెట్లు బుక్ చేసుకోవడమే కాకుండా, రాజ్ కుష్వాహాతో ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కుట్రను అమలుపరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంది. భర్త రాజా రఘువంశీతో శారీరక సంబంధాన్ని వాయిదా వేసేందుకు, మేఘాలయ(Meghalaya) వెళ్లే ముందు కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని, అది ఒక మంచి శకునమని నమ్మించి, సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది.రాజా రఘువంశీ పోస్టుమార్టం నివేదికలో,ఆయన తలపై పదునైన ఆయుధంతో రెండుసార్లు దాడి చేశారు. “మృతుడి తలపై రెండు చోట్ల పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలున్నాయి. ఒకటి తల వెనుక భాగంలో, మరొకటి ముందు భాగంలో ఉంది” అని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియెమ్ వెల్లడించారు.  

Read Also: Meghalaya Murder: రఘువంశీ హంతకుడిని చెంప మీద కొట్టిన ప్రయాణికుడు

#HoneymoonMurderCase #MurderPlot#CrimeInMeghalaya #RajaRaghuvanshi #SonamRaghuvanshi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.