Medak news: కస్తూర్బా స్కూల్‌లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!

Read Time:  1 min
Medak news: కస్తూర్బా స్కూల్‌లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!
FONT SIZE
GET APP

Medak news: మెదక్ జిల్లా రేగోడ్‌లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ఉదయం అల్పాహారం (టిఫిన్) తిన్న కొద్దిసేపటికే 22 మంది విద్యార్థినులతో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధితులు ఇబ్బంది పడటంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

Read Also: Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

Medak news: Food poisoning at Kasturba School: 25 people fall ill!
Medak news: Food poisoning at Kasturba School: 25 people fall ill!

ఆందోళనలో తల్లిదండ్రులు

అస్వస్థతకు గురైన వారందరినీ తక్షణమే చికిత్స నిమిత్తం రేగోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వరుసగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్(Food Poisoning)ఘటనలు వెలుగుచూస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.