Lucknow Road Accident: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా, నలుగురు మృతి

Read Time:  1 min
Lucknow Road Accident: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా, నలుగురు మృతి
FONT SIZE
GET APP
Lucknow Road Accident: Double-decker bus overturns, four killed
Lucknow Road Accident: Double-decker bus overturns, four killed

Lucknow Road Accident: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులోని గోసాయి గంజ్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక డబుల్ డెక్కర్ బస్సు నియంత్రణ కోల్పోయి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. లూథియానా నుంచి బీహార్‌లోని దర్భంగాకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read also: Visakhapatnam Crime News: రాంగ్ కాల్ పరిచయం.. చివరకు హత్యకు దారి

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.