📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Uttar Pradesh: అనుమానంతో భార్య ను హతమార్చిన భర్త

Author Icon By Anusha
Updated: April 5, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా నగరంలో ఓ భర్త తన భార్యను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 15 ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను సుత్తితో మర్డర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.పూర్తి వివరాలు మీకోసం,అస్మా ఖాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెక్టార్ 62లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె ఇంతకుముందు ఢిల్లీలో నివసించేది. జామియా మిలియా ఇస్లామియా నుండి ఇంజనీరింగ్ పట్టా పొందింది. నిందితుడు బీహార్‌కు చెందినవాడు. అతను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు.వీరికి 2005లో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాగా, కుమార్తె 8వ తరగతి చదువుతోంది.ఈ సంఘటన గురించి మొదట వారి కుమారుడు 112కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందిన వెంటనే, మా బృందం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపాము. మరింత విచారణ జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబాదన్ సింగ్ తెలిపారు.హైదర్ తన భార్య వివాహేతర సంబంధాలు కలిగి ఉందని అనుమానించాడని ప్రాథమిక విచారణలో తేలింది. “ఈ ఉదయం వారి కుమార్తె నాకు ఈ విషయం చెప్పింది. వారు చాలా రోజులుగా గొడవ పడుతున్నారు. అతను ఇంత దారుణమైన చర్యకు పాల్పడతాడని మేము ఊహించలేదు” అని బాధితురాలి బావ తెలిపారు.

కేసు నమోదు

భర్త నూరుల్లా హైదర్ తన భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ వాదనలు చేస్తూ వచ్చినట్టు తెలిసింది. ఈ అనుమానమే చివరకు హత్యకు దారితీసింది.వీరి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, కోపానికి గురైన హైదర్ అర్ధరాత్రి సమయంలో సుత్తితో భార్యపై దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన అస్మా ఖాన్ అక్కడికక్కడే మరణించింది.అస్మా బావ మీడియాతో మాట్లాడుతూ,ఇంత దారుణంగా ఆమెను హత్య చేస్తాడని ఊహించలేకపోయాం,” అని వాపోయారు. పిల్లల భవిష్యత్తుపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సంఘటనకు సంబంధించి నొయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదర్ గతంలో మానసిక సమస్యలతో బాధపడ్డాడా? లేదా అని దీని వెనుక ఇతర కారణాలున్నాయా అనే దానిపై విచారణ సాగుతోంది.వారి మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

#crimenews #DomesticViolence #NoidaNews #TragicIncident #UttarPradeshNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.