📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Bihar: బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో కాల్పులు..ముగ్గురు మృతి!

Author Icon By Vanipushpa
Updated: March 26, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా.. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపుతోంది.

ఘటనపై కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 3,4 మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జిపై ఒక వ్యక్తి.. ఒక యువతిపై, ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పులు శబ్దం విన్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు ముగ్గురు మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనలో మరణించిన యువతి ఢిల్లీ వెళ్లేందుకు రైలు ఎక్కడానికి తన తండ్రితో కలిసి స్టేషన్‌కు వచ్చినట్టు చెబుతున్నారు.

అడిషనల్ ఎస్పీ పరిచయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ..
అడిషనల్ ఎస్పీ పరిచయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ స్టేషన్‌లోని 3, 4 ప్లాట్ ‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జిపై.. ముగ్గురు వ్యక్తులు తుపాకీ గాయాలతో మరణించారని తెలిపారు. మొదట యువతిని, ఆ తర్వాత ఆమె తండ్రిని కాల్చి తర్వాత తనను తాను కాల్చుకున్నట్టు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి వయస్సు 23-24 సంవత్సరాల మధ్య ఉంటుందని.. అమ్మాయి వయస్సు 16-17 సంవత్సరాల మధ్య ఉంటుందని వివరించారు.
మరోవైపు ఆర్‌పీఎఫ్ సీనియర్ కమాండెంట్ ప్రకాష్ పాండా మాత్రం ఈ సంఘటన ప్లాట్‌ఫామ్ నెంబర్ 2లో జరిగిందని తెలిపారు. నిందితుడు టార్గెట్ చేసి మరీ కాల్పులు జరపడం.. ఆ తర్వాత తనకు తాను కాల్చుకోవడం చూస్తుంటే ప్రేమ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి అమన్ కుమార్ గా తెలిపారు. యువతి పేరు జియా కుమారి, ఆమె తండ్రి పేరు అనిల్ సిన్హాగా చెప్పారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Firing at Ara railway station Google News in Telugu in Bihar. Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Three dead!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.