📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Kanpur Fire: కాన్పూర్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం..

Author Icon By Vanipushpa
Updated: May 5, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాన్పూర్ చమన్‌గంజ్ ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమైన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.
మంటలను అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ముందుజాగ్రత్తగా, సమీపంలోని భవనాలను ఖాళీ చేయించారు.సంఘనా స్థలంలో 12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, భవనంలో అక్రమంగా షూ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా?
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని కాన్పూర్ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. పిల్లల బెడ్‌ రూమ్‌లు నాలుగో అంతస్తులో ఉన్నాయని, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎడీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వారిని రక్షించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించామని చెప్పారు. అయితే పూర్తిగా కాలిపోవడంతో వారు కూడా మరణించారని చెప్పారు. మృతులను డానిష్‌ (45) అతని భార్య నజ్మీ సాబాగా గుర్తించామన్నారు. అతని ముగ్గురు పిల్లలు కూడా మరణిచారని వెల్లడించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read Also: Pakistan: పాక్ కు చీనాబ్ నది నీళ్లు నిలిపివేత !

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Fire accident in Kanpur Five people burnt alive.. Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.