Dharmasthala Case: ధర్మస్థలలో మరో అస్థిపంజరం లభ్యం

Read Time:  1 min
ధర్మస్థలలో మరో అస్థిపంజరం లభ్యం
ధర్మస్థలలో మరో అస్థిపంజరం లభ్యం
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ధర్మస్థలి కేసు(Dharmasthala Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్న సిట్(Sit) కు ఇప్పటివరకు 11 ప్రాంతాలలో అనుమానాస్పద మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కిందటిదిగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డాయి. దాని ఒంటిపై చొక్కా ఉండడం, మెడకు ఉరి వేసుకున్నట్లు తాడు ఉండడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. ఈ అవశేషాలు ఒక మగవారివి కావచ్చని ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Dharmasthala Case: ధర్మస్థలలో మరో అస్థిపంజరం లభ్యం
Dharmasthala Case: ధర్మస్థలలో మరో అస్థిపంజరం లభ్యం

ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు
ఒకప్పుడు ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అతను 1995-2014 మధ్యకాలంలో 100కు పైగా మృతదేహాలను తనచేత బలవంతంగా పాతిపెట్టించారని కోర్టులో తెలిపాడు. అందులో మహిళలు, యువతులు, బాలికలు ఉన్నారని, వారిలో కొందరు లైంగిక వేధింపులకు గురైన తర్వాత హత్య చేయబడ్డారని ఆరోపించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక సర్కార్ నలుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని
మరోవైపు ఇదే కేసులో మరో ప్రత్యక్ష సాక్షి అయిన జయంత్ అనే వ్యక్తి కూడా SITకి వాంగ్మూలం ఇచ్చారు. తాను 15 సంవత్సరాల క్రితం 13 నుంచి 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చూశానని, దాని గురించి పోలీసులకు చెప్పినా పోస్టుమార్టం నిర్వహించకుండానే ఖననం చేశారని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. తాను మరిన్ని ఖననాల గురించి ప్రత్యక్షంగా చూశానని, స్థానికులకు కూడా ఈ విషయాలు తెలుసని, అయితే భయం వల్ల ఎవరూ బయటకు రావట్లేదని ఆయన తెలిపారు. జయంత్ ఒక ఆర్టీఐ కార్యకర్త. ఆర్టీఐ ద్వారా పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. తప్పిపోయిన వ్యక్తుల డేటా మరియు ఛాయాచిత్రాలను తనకు అందించమని తాను గతంలో బెల్తంగడి పోలీస్ స్టేషన్‌ను అభ్యర్థించానని, కానీ పోలీసులు వింతైన సమాధానం ఇచ్చారని జయంత్ చెప్పాడు .

సామూహిక ఖననం ఆరోపణ
జూన్ 22, 2025న, బెంగళూరుకు చెందిన న్యాయవాదులు ఓజస్వి గౌడ మరియు సచిన్ ఎస్ దేశ్‌పాండే ఒక లేఖను విడుదల చేశారు, అత్యాచారం మరియు హత్య బాధితుల మృతదేహాల స్థానాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్న ఒక క్లయింట్ తమ వద్ద ఉన్నారని, అతను తనను తాను పాతిపెట్టాడని పేర్కొన్నారు.

తవ్వకాలు
నేత్రావతి నది వెంబడి ఐదు ప్రదేశాలలో అధికారులు, పోలీసు సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది సమక్షంలో తవ్వకాలు జరిపినప్పుడు ఎటువంటి మానవ అవశేషాలు కనుగొనబడలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pakistan-rahim-yar-khan-airbase-unrevealed/national/526298/

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.