భారతదేశ రాజధాని ఢిల్లీలోని(Delhi bomb blast) చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో సోమవారం రద్దీగా ఉండే ప్రాంతంలో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ ఎల్ ఎన్ జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్కు చేసిన హ్యుందాయ్ కారులో బాంబు బ్లాస్ట్ అయింది. హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని చెబుతున్నారు. సాధారణంగా బాంబు పేలుళ్లలో గాయపడిన వారి శరీరాలపై గాజు గుళికలు చెల్లాచెదురుగా పడతాయి. అయితే, ఈ సంఘటనలో అలాంటి గుళికలు ఏవీ కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగుతోందని, అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని పోలీస్ కమిషనర్ సతీష్ కోల్చా తెలిపారు. కారణమేమిటో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం.
Read also: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

సమగ్ర దర్యాప్తు జరుగుతుంది:అమిత్ షా
ఫోరెన్సిక్(Delhi bomb blast) విభాగం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సంఘటన స్థలం నుండి సేకరించిన నమూనాలను పరిశీలించిన తర్వాతే మేం ఏదైనా చెప్పగలమని అన్నారు. అయితే, మేం అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నాం. ఉగ్రవాద దాడితో సహా అన్ని కోణాల నుండి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. పేలుడు జరింగిన ప్రదేశాన్ని సందర్శించానని, దీనికి సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అమిత్ షా(Amit Shah) అన్నారు. పేలుడుకు కారణమైన కారు యజమానిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు, హర్యానాలోని గురుగ్రామ్ లో మహమ్మద్ సల్మాన్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఈ కారును సల్మాన్ తర్వాత ఓఖాలోని దేవేంద్రకు, ఆపై అంబాలాలోని మరొక వ్యక్తి విక్రయించినట్లు వెల్లడైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: