📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

Author Icon By Anusha
Updated: February 25, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో మానవత్వం మంటగలిసే ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ బాలికకు అక్కడి కానిస్టేబుల్ నుంచి నరకయాతన ఎదురైంది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు మరింత దారుణంగా మోసపోయింది. ఈ ఘటన గత ఏడాది జులైలో జరిగినప్పటికీ, తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం, విక్కీ అనే యువకుడు స్నేహం పేరుతో దగ్గరై, ఆమెను మోసగించి పలుమార్లు అత్యాచారం చేశాడు. న్యాయం కోసం బెంగళూరులోని మైకో లేఔట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ సదరు బాలికకు సహాయం చేస్తానని నమ్మబలికాడు.

మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి దారుణం

అనంతరం మాయమాటలు చెప్పి,  ఓ హోటల్ కు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై వీడియోలు తీసి ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. 

తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

ఈ ఘటన వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాలిక చాలా రోజుల పాటు ఎవరికీ చెప్పలేదు. అయితే, ఇటీవల తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె తల్లి మైకో లేఔట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోక్సో కేసు నమోదు

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి, సదరు యువకుడు విక్కీతో పాటు కానిస్టేబుల్ అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోక్సో (ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్‌లో ఉండగా, ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

కఠిన చర్యలుఅవసరం

ఈ ఘటనపై న్యాయవాదులు, మహిళా హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం కోసం వెళ్ళిన బాధితురాలు అక్కడే మోసపోవడం సమాజం లోపాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తోంది. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి.ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నియమాలు అమలు చేయాలి.

#BengaluruCrime #crimenews #JusticeForSurvivor #POCSOCase #PoliceBrutality Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.