ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఏడు నెలల గర్భిణీ ప్రాణాన్ని బలితీసుకుంది. తాను చనిపోతున్నానని తెలిసిన ఆ తల్లి, చేతిలోని కుమార్తెను రక్షించుకుని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..బాలానగర్(Balanagar)కు చెందిన సయ్యద్ జమీర్, ఆస్ర ఫాతిమా(Fathima) (29) దంపతులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లి(Upperpalli)లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఫాతిమా ఏడు నెలల గర్భిణీ. అత్తాపూర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 90 దగ్గరలోని ఓ ఆసుపత్రిలో భర్త గురువారం ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత తన బైక్పై భార్యాభర్తలు కుమార్తెతో కలిసి ఇంటికి బయలుదేరారు.
కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డోరు తీశాడు
రెప్పపాటు కాలంలో : ఇంకాసేపట్లో ఇంటికి చేరుతారు అనే లోపల ప్రధాన రహదారిపై 198వ పిల్లర్ దగ్గర ఓ కారు ఆగింది. వెనక వస్తున్న బైక్ను గమనించకుండా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒక్కసారిగా డోరు తీశాడు. దీంతో జమీర్ బైక్ వెళ్లి ఆ డోర్కు తగలడంతో అదుపుతప్పి పడిపోయింది. బైక్ వెనుక సీట్లో ఉన్న ఫాతిమా, కుమార్తె ఇద్దరూ కుడివైపు పడిపోయారు. అదే సమయానికి అటుగా ఓ ఆర్టీసీ బస్సు(RCT Bus) రావడంతో ఫాతిమా బస్సు వెనక చక్రాల కింద పడిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె రెప్పపాటు కాలంలోనే తన కుమార్తెను దూరంగా నెట్టివేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. నిర్లక్ష్యంగా కారు డోరు తీసిన వ్యక్తి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ ప్రమాదం అనంతరం పారిపోయినట్టు సమాచారం, అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు, విచారణ ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది – రోడ్డుపై ఒక్క విషయంలో నిర్లక్ష్యం అనేక కుటుంబాల జీవితాలను తుడిచిపెట్టగలదు. తల్లితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆస్ర ఫాతిమా సాహసానికి శతకోటికాలాలు నమస్సులు.
Read Also: Kriti Patel: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ క్రితి పటేల్ను అరెస్ట్ చేసిన పోలీసులు