📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Bengaluru: భర్త పిల్లల్ని వదిలేసివచ్చిన.. ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లి తర్వాత సంబంధాల్లో చొరబడిన మూడో వ్యక్తి వల్ల హాయిగా సాగాల్సిన గృహజీవితం అగ్నిగుండంగా మారుతోంది. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఒక విషాదకర ఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే, బెంగుళూరులోని బాణశంకరి పరిధిలో హేమ్మిగేపుర ప్రాంతానికి(Hemmigepura area) చెందిన హరిణి (33), దేసేగౌడ (41) భార్యాభర్తలు. 2012లో పెళ్లైన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం,బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ హరిణి జీవితంలో భాగమయ్యాయి. సాఫీగా సాగుతున్న జీవితంలోకి మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి ప్రవేశించాడు.

వివాహేతర సంబంధానికి

మూడు సంవత్సరాల క్రితం ఒక జాతరలో కామన్ ఫ్రెండ్ ద్వారా హరిణికి యశాస్ (25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచుగా యశాస్‌ను కలుస్తూ, తన సంసార జీవితాన్ని పక్కన పెడుతూ వచ్చింది హరిణి(Harini). అయితే ఈ విషయం హరిణి భర్త, కుటుంబ సభ్యులకు తెలియగా వారు షాక్‌కు గురయ్యారు. కౌన్సిలింగ్ ఇచ్చి బంధాలు, విలువలు, కుటుంబ గౌరవం గురించి వివరించారు. హరిణి కూడా తన తప్పును తెలుసుకుని గత రెండు నెలలుగా యశాస్‌ను కలవడం మానేసింది. అందరిలాగే తన జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంది.

Bengaluru

హరిణిని ఒప్పించాడు

ఈ క్రమంలో చివరిసారిగా కలుద్దామని హరిణిని యహాస్(Yahas) అడిగాడు. అందుకు నిరాకరించిన హరిణి తన భర్తకు విషయం తెలిసిపోయిందని, మరోసారి కలవలేనని చెప్పింది. యశాస్ చాలా సేపు ప్రయత్నించి హరిణిని ఒప్పించాడు. దీంతో ఈ నెల 6వ తేదీన పూర్ణ ప్రజ్న లేఅవుట్‌లోని ఓయో హోటల్‌లో యుశాస్, హరిణి కలుసుకున్నారు. హరిణి తనతో బంధం తెంచుకుంటుందని కోపోద్రిక్తుడైన యశాస్ ముందుగానే తెచ్చుకున్న కత్తితో ఆమెను 17 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు.

Read Also: RCB: ఆర్సీబీ ఘటనలో గవర్నర్‌,సీఎంల మధ్య ముదురుతున్న వివాదం

#BangaloreCrime #crimenews #DomesticViolence #ExtraMaritalAffair #ShockingMurder Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.