📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Suicide: చదువు ఒత్తిడి భరించలేక బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈశాన్య కర్ణాటక(Karnataka)లోని రాయ్‌చూర్‌(Raichur)కు చెందిన మహన్‌టప్ప దంపతులకు తేజస్విని (19). వీరికి ఆమె ఒక్కతే కూతురు. కొడుగు జిల్లాలోని ఓహల్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో సీట వచ్చింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్ కోర్సులో తేజస్వి(Tejasswi)ని చేరింది. కోటి జాగ్రత్తలు చెప్పి కూతురిని అక్కడికి పంపించారు తల్లిదండ్రులు. మూడు రోజుల క్రితం కూడా తేజస్విని ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. మిస్సైన ఫ్రెండ్స్‌కు బుధవారం స్వీట్స్‌ కూడా పంచింది. ఏం జరిగిందో తెలియదుగానీ అదే రోజు తరగతులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని తన హాస్టల్‌ గదికి వెళ్లిపోయింది.

Suicide: చదువు ఒత్తిడి భరించలేక బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య

సాయంత్రం 4.30 గంటలకు అంటే అరగంట తర్వాత ఆమె క్లాస్‌మేట్స్‌లో ఒకరు తేజస్విని గది తలుపు కొట్టగా ఎంతకూ లోపలి నుంచి అలికిడి రాలేదు. లోపలి నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించింది. ఆమెకు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో వెంటనే హాస్టల్ సూపర్‌వైజర్‌కి ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే హాస్టల్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా తేజస్విని లోపల అపస్మారకస్థితిలో కనిపించింది.
సూసైడ్‌ నోట్‌ను అధికారులు స్వాధీనం
వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆమె గదిలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను చదువు ఒత్తిడి కారణంగా తాను సూసైడ్‌ చేసుకుంటున్నట్లు తెలిపింది. తనకు ఆరు బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని, చదువు కొనసాగించడం ఇష్టపడటం లేదని అందులో చెప్పింది. పొన్నంపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: BRS: బీఆర్ఎస్ నేత ఆత్మహత్య

#telugu News Ap News in Telugu B.Tech student commits suicide Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the pressure of studies Today news Unable to bear

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.