हिन्दी | Epaper

Aminpur Police: అమీన్‌పూర్‌లో ఓపీఎం పట్టివేత

Tejaswini Y
Aminpur Police: అమీన్‌పూర్‌లో ఓపీఎం పట్టివేత

Aminpur Police: రాజస్థాన్ కు చెందిన మార్వాడీ హేతారాం అనే వ్యక్తి వద్ద నుంచి 2.7 కిలోల ఓపీఎం మత్తు పదార్థంతో పాటు లక్ష రూపాయల నగదు స్వాధీనం. రూ. 14 లక్షల విలువ చేసే ఓపీఎంను రాజస్థాన్ నుంచి తెచ్చి అమీన్ పూర్ లో విక్రయిస్తున్న హేతారాం నమ్మదగిన సమాచారంతో అర్థరాత్రి ఎస్ ఓ టీ సిబ్బంది దాడి. హేతారాంతో పాటు ఓపీఎం కొనుగోలు దారులు ఇద్దరు అరెస్ట్. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అమీన్ పూర్ పోలీసులు.

Read Also: Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

రూ. 14 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం

నిందితుడు హేతారాం వద్ద నుండి 2.7 కిలోల ఓపీఎంతో పాటు ఒక లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థం విలువ మార్కెట్లో సుమారు రూ. 14 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హేతారాంతో పాటు ఈ డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870