Karnataka: ప్రాణం తీసిన మద్యం పందెం

Read Time:  1 min
Karnataka: ప్రాణం తీసిన మద్యం పందెం
FONT SIZE
GET APP

సెల్ఫీ తీసుకుంటూ రైలు కింద,పడి చనిపోయిన ఘటనలు తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి స్నేహితుల మధ్య సరదాలు కూడా ప్రమాదానికి దారి తీస్తుంటాయి. స్నేహితులను ఆటపట్టించడం, పందెం కాయడం సాధారణంగా చూస్తుంటాం. అలా స్నేహితులతో కాసిన పందెంలో ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగితే, పది వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో పందెం ప్రకారం తాగి, అస్వస్థతకు గురై మరణించాడు. కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు.వెంకటరెడ్డి, సుబ్రమణితో పాటు మరో ముగ్గురు కార్తీక్‌తో పందెం కాశారు. ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం నీళ్లు కలపకుండా తాగాలనేది ఒప్పందం. పందెం ప్రకారం చుక్క నీరు కలపకుండా ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగాడు కార్తీక్. కానీ తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్తీక్‌ను వెంటనే కోలార్ జిల్లాలోని ముల్‌బగల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు వదిలాడు. విషాదకరమైన విషయం ఏంటంటే అతడికి ఏడాది కిందటే పెళ్లి జరిగింది. 8 రోజుల కిందటే తండ్రయ్యాడు. కార్తీక్ మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పందెంతో అన్యాయంగా తమ కొడుకును పొట్టనబెట్టుకున్నారని కార్తీక్ తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

 Alcohol:  ప్రాణం తీసిన మద్యం పందెం

నివేదిక

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతడితో పందెం కాసిన వెంకటరెడ్డి, సుబ్రమణితో పాటు ఆరుగురిపై నంగలి పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి, సుబ్రమణిని అరెస్టు చేయగా మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సరదాగా చేసే ఇలాంటి కార్యకలాపాలతో చాలా మంది బలవుతున్నారని, ప్రతి ఒక్కరూ అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.మరోవైపు ఏటా దాదాపుగా 2.6 మిలియన్ల మంది మద్యం సేవించడం వల్ల చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నివేదిక వెల్లడించింది. అంటే ప్రపంచంలో ఏడాదిలో చనిపోయేవారి సంఖ్యలో ఇది 4.7 శాతంగా పేర్కొంది. సురక్షితమైన పద్ధతిలో పరిమితంగా ఆల్కహాల్‌ సేవించడం ప్రమాదకరమేమీ కాదని, హద్దు మీరితే ప్రాణాలకే ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Read Also: Delhi: ఢిల్లీలో భారీ వర్షంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.