CM Revanth Reddy to leave for Delhi this afternoon

CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారని సమాచారం. పార్టీ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సాయంత్రం భేటీకానున్నారు. ఈరోజు, రేపు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దలతో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరు ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం రాగానే మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.

image

కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్ విభజనపై ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చిస్తారని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా కలిగే నష్టం, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై చర్చించారు. చెన్నై సదస్సులో తీర్మానాలతో పాటు దక్షిణాదిన డీలిమిటేషన్ పై జరుగుతున్న గందరగోళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి, భట్టి మంతనాలు జరుపుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Related Posts
మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారు : ఎమ్మెల్సీ కవిత
Women are losing out politically.. MLC Kavitha

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ Read more

మార్చి 24-25న బ్యాంకుల సమ్మె
Bank strike on March 24-25

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. దీంతో ప్రణాళిక ప్రకారం మార్చి 24- Read more

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇకపై 5 శాతం ఐఆర్ – సీఎం రేవంత్
telangana announces interim

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ Read more

కార్యకలాపాలను విస్తరించిన పేయిన్‌స్టాకార్డ్
Paynstockard expanded operations

హైదరాబాద్: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేయిన్‌స్టాకార్డ్ ఈరోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన కొత్త, అత్యాధునిక కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాండిక్స్ ఇండియా అపెరల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *