CM Revanth Reddy introduced the caste enumeration survey report

కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన సీఎం..

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ 61,84,319 మంది (17.43శాతం) ఉన్నారని తెలిపారు. బీసీలు (ముస్లిం మైనారిటీలు మినహా) 46.25శాతంగా ఉన్నారని.. బీసీల జనాభా 1,64,09,179గా ఉందని పేర్కొన్నారు. ఎస్టీలు 37,05,929 మంది (10.45శాతంగా) ఉన్నారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు 44,57,012 మంది (12.56శాతంగా) ఉన్నారని చెప్పారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 (10శాతం)గా ఉన్నారని పేర్కొన్నారు.

image

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వే నివేదికను సభలో ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో నిర్ణయించామని.. కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 మంది (2.48శాతంగా) ఉన్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఓసీలు 56,01,539 (15.79శాతంగా) మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47,21,115 మంది (13.31శాతం) ఉన్నారని రేవంత్‌ చెప్పారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామన్నారు.

దాదాపు 50 రోజులపాటు సర్వే జరిగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని చెప్పారు. పట్టణాల్లో 45.15లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 1.12కోట్ల కుటుంబాల సర్వే జరిగిందన్నారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్‌ అతికించారన్నారు. ఒక ఎన్యుమరేటర్‌ రోజుకు పది ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని.. ఎనిమిది పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు. 76వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు డేటా క్రోడీకరించి.. రూ.125కోట్లు ఖర్చు చేసి సమగ్ర వివరాలు సేకరించినట్లు వివరించారు. నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే సర్వే చేసినట్లు స్పష్టం చేశారు.

Related Posts
బీజేపీలో వేధింపులు తట్టుకోలేపోతున్నా: రాజాసింగ్
బీజేపీలో వేధింపులు తట్టుకోలేపోతున్నా: రాజాసింగ్

"2014 లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్న.. ఇక తట్టుకోలేపోతున్నా. పార్టీకి అవసరం లేదు వెళ్ళిపో అని చెబితే ఇప్పటికిపుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా" అని Read more

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్‌..
Arrest warrant issued against former Prime Minister of Bangladesh Sheikh Hasina

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఈ వారెంట్ ఇచ్చింది. Read more

రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం..
Who will own Ratan Tatas p

దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రతన్ టాటాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ2 సర్కార్ 2008లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి Read more

CM Revanth Reddy : తెలంగాణలో విద్యా రంగం క్షీణించిపోతోంది : సీఎం రేవంత్‌ రెడ్డి
తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy : తెలంగాణలో విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో Read more