
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చెన్నై పర్యటనలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలిశారు.. చెన్నైలో జరిగిన తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య, కార్తీ కూడా పాల్గొనడంతో వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
Read Also: Tirupati: మంచు విష్ణుకు నోటీసులు?
ఆత్మీయంగా పలకరించారు
ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వివాహ వేడుకలో జగన్ ఎంతో ఆత్మీయంగా సూర్య, కార్తీలతో ముచ్చటించారు. వారందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: