పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)అభిమానుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులను ఆశ్చర్యపరుస్తూ చిత్ర బృందం ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
సెప్టెంబర్ 29న ట్రైలర్ రిలీజ్
చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ప్రకారం, సెప్టెంబర్ 29న ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక పవర్ఫుల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదల తేదీ ముందస్తుగా తెలియకపోవడం వల్ల అభిమానులకు ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లా మారింది.
హారర్ కామెడీ జానర్లో మారుతి స్టైల్
దర్శకుడు మారుతి (Director Maruti)తన ప్రత్యేకమైన శైలిలో ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్కు విపరీతమైన స్పందన రావడంతో, ఇప్పుడు అందరి కళ్లూ ట్రైలర్పై నిలిచాయి.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మూడు కథానాయికలు నటిస్తున్నారు.నిధి అగర్వాల్,మాళవిక మోహనన్,రిద్ధి కుమార్ఇదే కాకుండా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని చిత్రబృందం అంటోంది.
ఎస్.ఎస్. థమన్ సంగీతం – మరో హైలైట్
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన BGM, టీజర్ మ్యూజిక్కి మంచి రెస్పాన్స్ రావడంతో, పూర్తి ఆల్బమ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారీ బడ్జెట్ – ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్ మరియు కృతి ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీం, విజువల్ ఎఫెక్ట్స్, మరియు నిర్మాణ విలువల పరంగా ‘ది రాజాసాబ్’ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా నిలవబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: