Sridevi Property Dispute: శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

Read Time:  1 min
Sridevi Property Dispute: శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట
FONT SIZE
GET APP

Sridevi Property Dispute: అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన విలువైన ఆస్తిపై తలెత్తిన వివాదంలో ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్లకు మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తమ ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను మార్చి 26, 2026కి వాయిదా వేసింది.

Read Also: Rukmini vasanth : ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

వివాదానికి కారణమైన 4.7 ఎకరాల భూమి

చెంగల్పట్టులోని సుమారు 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం కొందరు వ్యక్తులు దాఖలు చేసిన సివిల్ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం జాయింట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ టి.వి. తమిళ్‌సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం, స్థానిక కోర్టులో జరుగుతున్న చర్యలపై తాత్కాలిక స్టే విధించింది. దీనివల్ల ప్రస్తుతానికి కపూర్ కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది. అసలు ఈ వివాదం 1988లో మొదలైంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఈ విలువైన ఆస్తిని శ్రీదేవి ఏప్రిల్ 19, 1988న చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఈ భూమికి అసలైన యజమాని ఎం.సి. సంబంధ ముదలియార్. ఆయన కుటుంబ సభ్యుల మధ్య 1960లో జరిగిన ఆస్తి పంపకాల ఒప్పందం ఆధారంగానే శ్రీదేవి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

అప్పటి నుండి ఈ ఆస్తి ఆమె కుటుంబం ఆధీనంలోనే ఉంది.అయితే, ముదలియార్ వారసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఈ ఆస్తిపై హక్కులు కోరుతూ వివాదం సృష్టించారు. దీనిపై బోనీ కపూర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సదరు వ్యక్తులు 2005లో తాంబరం తహసీల్దార్ నుండి వారసత్వ ధ్రువపత్రాన్ని పొందారు. అయితే ముదలియార్ కుటుంబం అసలు తాంబరంలో నివసించలేదని, మైలాపూర్‌లో ఉండేవారని బోనీ కపూర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వారసులమని చెప్పుకుంటున్న వారిలో ఒకరు ముదలియార్ కుమారుడి రెండో భార్య అని క్లెయిమ్ చేస్తున్నారు.

Sridevi property dispute: Relief for Boney Kapoor family in High Court
Sridevi property dispute: Relief for Boney Kapoor family in High Court

కానీ, మొదటి భార్య బతికి ఉండగానే జరిగిన ఈ వివాహం చట్టబద్ధం కాదని, హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారికి ఆస్తిలో వాటా ఉండదని బోనీ కపూర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్, ఆ ముగ్గురు వ్యక్తుల పేరుతో ఉన్న మోసపూరిత వారసత్వ ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్‌కు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ హైకేసు హైకోర్టు పరిధిలో ఉంది. మోసపూరిత పత్రాలతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీదేవి కుటుంబం కోరుతోంది. వచ్చే విచారణలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.