90వ దశకంలో తెలుగు సినీ పరిశ్రమను తన అందంతో, అభినయంతో ఊపేసిన అగ్ర కథానాయిక రంభ మరోసారి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రంభ, వివాహం అనంతరం సినిమాలకు దూరమైంది. అప్పటితరం ప్రేక్షకులలో ఎంతో మందికి ఇప్పటికీ రంభ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇప్పుడు రంభ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తన రీఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఇప్పటికే చాలా మంది సీనియర్ బ్యూటీలు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు.ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది.
సినిమా నా ఫస్ట్ లవ్
రంభ గ్లామర్, నటన, ఆమె గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియెన్స్ ఫిదా అయ్యేవారు. రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.ఎలాంటి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
రీఎంట్రీ
ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మీరా జాస్మిన్, అన్షు అంబానీ, లయ, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి హీరోయిన్స్ మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. తాజాగా రంభ సైతం రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో హీరో జేడీ చక్రవర్తితో కలిసి సందడి చేసింది.ఇటీవలే తమిళంలో ఓ టీవీ షోలో పాల్గొంది రంభ. ఇప్పుడు తెలుగులోకి సైతం రీఎంట్రీ ఇస్తుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో ఓ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చింది రంభ. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో జేడీ చక్రవర్తితో కలిసి ఎంట్రీ ఇచ్చింది రంభ. ఆ సమయంలో బొంబాయి ప్రియుడు సినిమాలోని పాటను వేశారు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ రంభ కోసం ఓ సాంగ్ పాడాడు. ఈ షోలో రంభ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంది. అనంతరం సుధీర్ తో కలిసి బావగారు బాగున్నారా సినిమాలోని ఓ సీన్ స్కిట్ వేశారు.అలాగే చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి, రంభ కలిసి కామెడీ పంచులతో అలరించారు. 90వ దశకంలో రంభ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దాదాపు పదేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. 1992లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రంభ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.