కొన్నిరోజులుగా శివాజీ, అనసూయ(Anasuya), మధ్య సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివాజీ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. (Prakash Raj)
శివాజీ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని, అతను చాలా చెత్తగా మాట్లాడాడని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆడవాళ్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి? మీలో ఉన్నదేగా బయటకి వస్తుంది. ఆడవాళ్లపై ఆ మాటలేంటి? ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్లకి మగవాళ్ల నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అనసూయకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఆమెను (అనసూయ) ఆంటీ అంటున్నారు. ఆ భాష ఏంటి?. ఆడవాళ్ల బాడీ పార్ట్స్ పై కామెంట్స్ చేయడం తప్ప, తెలుగులో ఇంకేమీ రాదు వాళ్లకి. బాడీ పార్ట్స్ గురించే వాళ్లు మాట్లాడతారు. ఎంత సంస్కారులు అనుకొని మాట్లాడుతున్నారో.. అది అంత అసహ్యం.
Read Also: Sundeep Kishan: ‘పతంగ్’ పై ఆఫర్ను ప్రకటించిన సందీప్ కిషన్

ప్రకాశ్ రాజ్: అనసూయకు అండగా నిలబడతాం
అనసూయని, అనసూయ లాంటి వారిని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్లకి సపోర్ట్ చేయడం నా బాధ్యత. అది మా కర్తవ్యం. (Prakash Raj) శివాజీ కానీ, ఎవరైనా గానీ.. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఒక ఎలా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలియాలి” అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక అనసూయ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ. ఆ సంస్కారవంతులను మొరుగుతూనే ఉండనివ్వండి. అది వాళ్ళ నీచమైన మనస్తత్వం. డియర్ అనసూయ, నువ్వు ధైర్యంగా నిలబడు. మేము నీకు అండగా ఉన్నాం. నీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: