పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం ‘ది రాజా సాబ్’ థియేటర్లలో విడుదలైనప్పుడు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలకు ముందు నుంచే పెద్ద హైప్ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే మళ్లీ చూడాలనుకునే అభిమానులకు ఇప్పుడు ఓటీటీ ద్వారా మరో అవకాశం లభించింది.
Read Also: Imanvi: పవన్ కళ్యాణ్ సినిమాలో ‘ఫౌజీ’ భామ?
వినూత్న పని
ఫిబ్రవరి 6 (శుక్రవారం) నుంచి రాజా సాబ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసింది. ఓటీటీలో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షుకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు, ఓటీటీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు చేసిన వినూత్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
జియో హాట్ స్టార్ ఆఫీసు కు పెద్దెత్తున బిర్యానీలు ఆర్డర్ పెట్టారు. ఇంతకు సంబంధించిన ఫోటోను జియో హాట్ స్టార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లవ్వే.. ఇదంతా లవ్వే.. ఎవరైనా కొట్టి చంపుతారు మీరు పెట్టి చంపుతున్నారు అంటూ రాసుకొచ్చింది.ఈ పోస్టును చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. “ప్రభాస్ (Prabhas) ఫుడ్తో ఎలా చంపేస్తాడో, అతడి ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు”, “ఇదీ ఫ్యాన్డమ్ అంటే”, “డార్లింగ్ స్టైల్ ఫాలో అవుతున్న అభిమానులు” అంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: