తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్లలో ఒకటైన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఇప్పుడు ఒక సంచలన విషయంతో వార్తల్లో నిలుస్తోంది. భారీ బడ్జెట్తో, స్టార్ కాస్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉంది.
ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమవుతుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై మంచు విష్ణు, ఆయన సోదరుడు మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
హార్డ్ డిస్క్ మాయం – ఫిలింనగర్లో కలకలం
కొద్దిరోజుల క్రితం “కన్నప్ప” మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ (hard disk) మిస్సింగ్ అయ్యిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ హార్డ్ డిస్క్లో ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించిన కొన్ని సన్నివేశాల (footage) ఉందన్న ప్రచారం జరగడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ, తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. మంచు విష్ణు ఆఫీస్ లో పనిచేసే చరిత అనే యువతి కన్నప్ప హార్డ్ డిస్క్ తీసుకుని పరారైందని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు.
ఇటీవల చెన్నైలో జరిగిన సినిమా ప్రచారంలో మంచు విష్ణు స్పందిస్తూ.. తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. వారే స్వయంగా చేశారా.. ? లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు.
మంచు మనోజ్ స్పందన – చురకల కలయికలో జవాబు
ఈ వివాదంపై తాజాగా మంచు మనోజ్ స్పందన ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం భైరవం సక్సెస్ఫుల్గా నిలవడంతో, చిత్ర యూనిట్ విజయోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
అదే వేదికపై ఓ జర్నలిస్టు, ‘‘కన్నప్ప హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా..’’ అని ప్రశ్నించగా, మనోజ్ చురకల కలయికలో స్పందిస్తూ – “నేను మీకే ఇచ్చాను కదా.. మర్చిపోయారా? మీరు మొన్న కలిసినప్పుడు ఇచ్చాను కదా” అంటూ నవ్వులు పూయించే జవాబు ఇచ్చారు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వుల వెల్లువ్లో మునిగిపోయారు.
అయితే వెంటనే ఆయన సీరియస్గానూ స్పందిస్తూ – ‘‘ఒక సినిమా తయారవ్వడమే చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎంతో మంది శ్రమ చేస్తారు. నేను నిజంగా ‘కన్నప్ప’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి సినిమా మిస్ అవ్వకూడదు’’ అని వ్యాఖ్యానించారు.

సినీ వర్గాల్లో వైరల్ అవుతున్న మనోజ్ సరదా కామెంట్స్
మంచు మనోజ్ చేసిన ఈ సరదా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మామూలుగా అయితే అలాంటి ప్రశ్నకు ఎవరైనా డిఫెన్సివ్గానో, సీరియస్గానో స్పందించేవారు. కానీ మనోజ్ తన యూనిక్ హ్యూమర్ తో జవాబిచ్చిన విధానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు” అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. “కన్నప్ప” హార్డ్ డిస్క్ వ్యవహారంపై ఇప్పటికే పోలీసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో రఘు, చరిత పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. మరి నిజంగా ఈ వ్యవహారం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది అధికారికంగా తేలాల్సి ఉంది.
Read also: Kankhajura Review : ‘కంఖజూర’ సిరీస్ రివ్యూ!