తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో గుర్తింపు పొందిన మంచు లక్ష్మీ తాజాగా ఓ సైబర్ సమస్యను ఎదుర్కొంది.మంచు లక్ష్మీ ఇన్ స్టాగ్రాం అకౌంట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. నాకు డబ్బులు అవసరం ఉంటే నేరుగా మిమ్మల్ని అడిగేస్తాను సోషల్ మీడియాలో మాత్రం అడగను కదా అని చెప్పుకొచ్చింది. మళ్లీ ఇన్ స్టాగ్రాం అకౌంట్ తన చేతికి వచ్చిన తరువాత చెబుతాను అంటూ మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సాధారణంగా సెలెబ్రిటీలకు ఇలాంటి కష్టాలు తప్పడం లేదన్న సంగతి తెలిసిందే. ప్రతీ సారి ఎవరో ఒకరు ఇలా హ్యాకర్ల బారిన పడుతూనే ఉన్నారు.మంచు లక్ష్మీ తాజాగా చేసిన ఈ ట్వీట్ అందరినీ నవ్విస్తోంది. హ్యాక్ అయిపోయిందా? ఇందులో నీ పాత్ర ఏమీ లేదు కదా అన్నా అంటూ విష్ణుని ట్యాగ్ చేస్తున్నారు. అసలే మంచు వారి మీద ప్రస్తుతం జరిగే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచు వారి లొల్లి రోడ్డు మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ వర్సెస్ విష్ణు అన్నట్టుగా వ్యవహారం జరుగుతోంది. ఆస్తి కోసం తాను ఏనాడూ పోరాటం చేయలేదని, ఆత్మ గౌరవం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నానని మనోజ్ చెబుతుంటాడు.
ఎమోషనల్ బాండింగ్
మనోజ్ రీసెంట్గా మంచు లక్ష్మీని చూసి కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే మంచు లక్ష్మీ, మనోజ్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అందరికీ అర్థమైంది. మంచు లక్ష్మీ, మనోజ్ ఒక వైపు, మోహన్ బాబు, విష్ణు ఒక వైపు ఉంటున్నట్టుగా కనిపిస్తోంది. అసలు సమస్య ఏంటన్నది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు ఈ మంచు గొడవల్లో మంచు లక్ష్మీ ఎందుకు దూరంగా ఉంటోంది బహిరంగంగా ఎందుకు మాట్లాడటం లేదన్నది తెలియడం లేదు.
తరిమేయాలని
మోహన్ బాబు ఆడియో లీక్స్, ఫాం హౌజ్ వద్ద మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, ఆ తరువాత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వంటి సంగతులు అందరికీ తెలిసిందే. మనోజ్ను జల్ పల్లి ఫాం హౌజ్ నుంచి బయటకు తరిమేయాలని విష్ణు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సినిమాల సంగతి చూసుకుంటే విష్ణు కన్నప్పతో బిజీగా ఉన్నాడు. మనోజ్ భైరవం అంటూ రానున్నాడు. మంచు లక్ష్మీ చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. ఇక సౌత్లో పలు భాషల్లో మంచు లక్ష్మీ నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇలా తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందంటూ ట్వీట్ చేయడంతో మంచు లక్ష్మీ మళ్లీ వార్తల్లోకి ఎక్కేసింది. మరి మళ్లీ తన అకౌంట్ ఎప్పుడు తిరిగి వస్తుందో చూడాలి.
Read Also: Jaat Movie: ‘జాట్’ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన మేకర్స్