లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తుతం తెలుగులో షష్టిపూర్తి చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్కి చెన్నై నుంచి ఇళయారాజా హైదరాబాద్కు వచ్చారు. ఇక ఆయన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. కీరవాణి పాటను రాసిన తీరు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇళయారాజా తనలోంచి మ్యూజిక్ ఎలా వస్తుందో తెలిసిన రోజు సంగీతం కంపోజ్ చేయడం ఆపేస్తానని అన్నారు.ఈ వయసులోనూ ఇలా కంపోజింగ్ చేయడం, సినిమా ప్రమోషన్స్కి రావడం ఏంటి? అని అడుగుతున్నారు రావొద్దా? ఈ వయసులోనూ ఇలా చేస్తున్నారే అని అడగాలి కదా, కీరవాణి గారు నా సినిమాకు పాట రాసారు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, నా మీద ప్రేమను చాటేలా పాటను రాసినట్టుగా అనిపిస్తోంది. నేను ఈ సినిమాకు పని చేశాను ఇందులోని పాటలు విన్నారు, వినబోతోన్నారు వింటూనే ఉంటారు’ అని ఇళయరాజా అన్నారు.
నచ్చిన పాట
యాంకర్ గీతా భగత్ ఓ ప్రశ్న అడిగే ప్రయత్నం చేసింది. క్యూ అండ్ ఏ కూడా ఉంటుంది అని ఇళయారాజా అంటే క్యూ అండ్ ఏ నాకు ఉండదు మీకే ఉంటుంది అని ఆయన అన్నారు. ఇక ఇన్ని వేల పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటి? అని ఇళయారాజాని గీతా భగత్ అడిగేసింది. ఒకటా రెండా? వేలకు వేల పాటలున్నాయి అంటూ ఇళయరాజా నవ్వేశారు. అయితే తనలోంచి సంగీతం ఎలా వస్తుందో తనకు తెలియదని, తనలోంచి సంగీతం ఎలా వస్తుందో తెలిసిన నాడు ఆ క్షణమే సంగీతం కంపోజ్ చేయడం ఆపేస్తాను అని ఇళయారాజా అన్నారు.
మూవీ ప్రమోషన్స్
రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రూపేశ్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో కీరవాణి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తనకు ఇళయారాజా అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో తాను రెండేళ్లు ఇళయారాజా సంగీతాన్ని ఇన్ స్పిరేషన్గా తీసుకుని మ్యూజిక్ చేశానని, అందుకే ఆయన స్టైల్లోనే ఆ పాటలు ఉంటాయని అన్నారు. ఆయన సంగీతానికి నేను పాట రాస్తానని కళ్లో కూడా అనుకోలేదంటూ కీరవాణి ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇళయారాజా నోటీసుల వివాదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.